వాహనదారులకు శుభవార్త.. ఓఆర్ఆర్పై వాహనాలకు అనుమతి…
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేటి అర్ధరాత్రి నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్జీసీఎల్) నిర్ణయించాయి. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించాయి. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపులు జరుగుతాయన్నారు. వాహనదారులు వీలైనంత మేరకు […]
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నేటి అర్ధరాత్రి నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్జీసీఎల్) నిర్ణయించాయి. ప్రజా ఆరోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్పై టోల్గేట్ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని నిర్దేశించాయి.
ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపులు జరుగుతాయన్నారు. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలకు ముందుకు రావాలని హెచ్ఎండీఏ సూచించింది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుండగా.. ఆ వేళల్లో మాత్రం ఓఆర్ఆర్పై కార్లకు అనుమతి ఉండదని హెచ్ఎండీఏ తెలిపింది. ఓఆర్ఆర్పై ప్రయాణించే గూడ్స్ వెహికిల్స్లో ప్రయాణీకులు ఉన్నట్లుగా టోల్ ప్లాజా సిబ్బంది గుర్తిస్తే.. వారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందజేయాలని హెచ్ఎండీఏ అధికారులు ఆదేశించారు.
Read More:
షాకింగ్: కరోనా వ్యాక్సిన్ ప్రయోగం విఫలం.. ఇక కష్టమేనా!
10, 12వ తరగతి పరీక్షలు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూల్స్ ఇవే..