వెంకీ చీఫ్ గెస్ట్గా ‘వాల్మీకి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హీరో అథర్వ మురళీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 20న చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన చిత్ర పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. తమిళ బ్లాక్బస్టర్ జిగర్తాండ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్లో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన […]
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ హీరో అథర్వ మురళీ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నెల 20న చిత్రం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన చిత్ర పోస్టర్లు, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. తమిళ బ్లాక్బస్టర్ జిగర్తాండ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్లో కనిపించనున్నాడు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాలు శిల్పకళా వేదికలో జరిగింది. విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. 14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అటు వరుణ్ తేజ్, ఇటు దర్శకుడు హరీష్ శంకర్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ను మీరు కూడా లైవ్లో వీక్షించండి.