తొలి మూవీ విడుదల అవ్వకముందే.. మెగా హీరోకు క్రేజీ ఆఫర్..!
'ఉప్పెన' సినిమాతో గ్రాండ్ ఎంట్రీని ఇవ్వాలనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్.
‘ఉప్పెన’ సినిమాతో గ్రాండ్ ఎంట్రీని ఇవ్వాలనుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. అయితే కరోనా రావడంతో.. ఈ హీరో మొదటి మూవీ విడుదలకు బ్రేక్ పడింది. ఇక ఆన్లైన్లో ఈ సినిమా వస్తుందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీపై దర్శకనిర్మాతలకు మంచి నమ్మకం ఉండటంతో.. కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే ఉప్పెనను విడుదల చేయాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ విడుదల అవ్వకముందే ఈ హీరోకు మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ను టాలీవుడ్కి పరిచయం చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్నే ఈ హీరోకు మరో ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి కూడా కొత్త దర్శకుడే దర్శకత్వం వహించనుండగా.. మరో నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా భాగస్వామ్యం అవ్వబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా ప్రేమ కథాంశంతో ఉప్పెన తెరకెక్కింది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి నటించగా.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. లెక్కల మాస్టార్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన బుచ్చిబాబు సన ఉప్పెన ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.