జెట్ స్పీడులో మెగా మేనల్లుడు..రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్..!
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్మడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు.
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్మడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఎప్పుడో ఏప్రిల్ 2న ‘ఉప్పెన’ విడుదల కావాల్సిన ఉన్నా.. కరోనా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. అయితే తొలి సినిమా కావడంతో ఓటీటీలవైపు వెళ్లకుండా..కాస్త లేటైనా థియేటర్స్ వైపే వెళ్లాలనుకుంటుంది ‘ఉప్పెన’ మూవీ టీమ్.
ఇదిలా ఉండగా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలే కాదు..కథలు నచ్చితే చిన్న సినిమాలు కూడా నిర్మించే సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్లో వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుతుంది. ఈ సినిమాను కూడా ఓ కొత్త దర్శకుడే తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.