ఈ కిరణాలను చూస్తే కరోనా పారిపోతుందట..!

వ్యాక్సిన్ల తయారీకి ఇంకా సమయం పడుతుందంటున్నారు సెంటిస్టులు. దీంతో కరోనా కట్టడిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు యూవీ లైట్ కిరణాల సహాయంతో కొత్త ప్రయోగం మొదలుపెట్టారు.

ఈ కిరణాలను చూస్తే కరోనా పారిపోతుందట..!
Follow us

|

Updated on: Jun 04, 2020 | 3:29 PM

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. విశ్వవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికీ వ్యాక్సిన్ దొరక్క జనం అల్లాడిపోతున్నారు. కానీ ఈ కిరణాలను చూస్తే కరోనా పారిపోతుందట. కరోనా నివారణకు ఇప్పటివరకు మందు అందుబాటులో రాలేదు. దీనికి మనిషికి మనిషి భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గం. వ్యాక్సిన్ల తయారీకి ఇంకా సమయం పడుతుందంటున్నారు సెంటిస్టులు. దీంతో కరోనా కట్టడిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా పరిశోధకులు యూవీ లైట్ కిరణాల సహాయంతో కొత్త ప్రయోగం మొదలుపెట్టారు. అతినీలలోహిత కిరణాలతో కరోనా భరతం పట్టవచ్చని గుర్తించారట. ఆ కాంతి కిరణాలతో కూడిన అల్ట్రావయోలైట్ పరికరాన్ని రూపొందించారు. దాదాపు 200 నుంచి 300 నానో మీటర్ల మేర తీవ్రత కలిగిన అతినీలలోహిత కిరణాలను వైరస్ పై పంపినపుడు కరోనా వైరస్ చనిపోతుందంటున్నారు. యూవీ లైట్ వల్ల పునరుత్పత్తి గానీ, ఇన్ఫెక్షన్లకు గానీ ఏమాత్రం అవకాశం లేకుండా శక్తిహీనమవుతాయట. యూవీ లైట్ ఎమిటింగ్ డయోడ్ల ధర మాత్రం కాస్త ఎక్కువే ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు.. దీని సర్వీసు మాత్రం ఎక్కువకాలం మన్నుతుందట. ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్న యూవీ లైట్ ఎమిటింగ్ డయోడ్ల ఉత్పత్తి పెంచి త్వరలో జనంలోకి అందుబాటు రానున్నాయి. వీటి పనితీరును అయా ప్రభుత్వాలు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు.