అనారోగ్యంతో ఉత్తరాఖండ్ ఆర్థికమంత్రి కన్నుమూత
ఉత్తరాఖండ్ ఆర్థికమంత్రి ప్రకాశ్ పంత్ మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్డెట్ ప్రసంగం చదువుతున్న సమయంలోనూ పంత్ రెండు సార్లు కళ్లు తిరిగి పడిపోయారు. అలాగే ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల తర్వాత పంత్ సీఎం రేసులో కూడా ఉన్నారు. చివరికి త్రివేంద్రసింగ్ రావత్ సీఎం కాగా, పంత్ […]
ఉత్తరాఖండ్ ఆర్థికమంత్రి ప్రకాశ్ పంత్ మృతి చెందారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర బడ్డెట్ ప్రసంగం చదువుతున్న సమయంలోనూ పంత్ రెండు సార్లు కళ్లు తిరిగి పడిపోయారు. అలాగే ప్రసంగాన్ని పూర్తి చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల తర్వాత పంత్ సీఎం రేసులో కూడా ఉన్నారు. చివరికి త్రివేంద్రసింగ్ రావత్ సీఎం కాగా, పంత్ ఆర్థిక శాఖతో సరిపెట్టుకున్నారు. కాగా, పంత్ మరణం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. అలాగే ఆయన మృతికి సంతాపంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది.