సీఎంకు నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్కి జరిపిన కరోనా పరీక్షల్లో నెగిటివ్గా తేలింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్కి జరిపిన కరోనా పరీక్షల్లో నెగిటివ్గా తేలింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కాగా ఆ రాష్ట్ర మంత్రి సాత్పాల్ మహరాజ్కి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఆయన ఇటీవల సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో త్రివేంద్ర రక్త నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్ష నిమిత్తం పంపగా.. ఫలితాల్లో నెగిటివ్గా తేలింది.
ఇదిలా ఉంటే ఆ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న మిగిలిన మంత్రులు మాత్రం కరోనా పరీక్షలు చేయించుకోలేదు. తాము సాత్పాల్లో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు లేవని, తమకు కరోనా రిస్క్ లేదని వారు అంటున్నారు. అందుకే పరీక్షలు చేయించుకోలేదని మంత్రులు మదన్ కౌశిక్, హరాక్ సింగ్ రావత్, సుబోధ్ యునియాల్ తెలిపారు. అయితే కేంద్రం మార్గ దర్శకాల ప్రకారం జూన్ 1 న రెండు వారాలపాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు వెల్లడించారు. కానీ మూడు రోజులు కాగానే గురువారం నుంచి ఈ ముగ్గురు యాధావిధిగా విధులకు హాజరయ్యారు.
Read This Story Also: ఆన్లైన్ క్లాస్ల కోసం ఇంటిపైకి ఎక్కిన విద్యార్థిని.. ఫొటోలు వైరల్..!