Breaking : కరోనాతో యూపీ మంత్రి కమలా రాణి కన్నుమూత

కరోనాతో ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​ మంత్రి కమలా రాణి వరుణ్​ ప్రాణాలు విడిచారు. ఆమె వయసు 62 సంవ‌త్స‌రాలు. క‌మాలాకు కరోనా సోకినట్లు సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్ల‌డించారు​.

Breaking : కరోనాతో యూపీ మంత్రి కమలా రాణి కన్నుమూత
Follow us

|

Updated on: Aug 02, 2020 | 11:48 AM

UP Minister Kamal Rani Varun Dies : కరోనాతో ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​ మంత్రి కమలా రాణి వరుణ్​ ప్రాణాలు విడిచారు. ఆమె వయసు 62 సంవ‌త్స‌రాలు. క‌మాలాకు కరోనా సోకినట్లు సీఎం యోగి ఆదిత్యానాథ్ వెల్ల‌డించారు​. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. స‌హ‌చ‌ర మంత్రి మృతి పట్ల తీవ్ర‌ విచారం వ్యక్తం చేశారు యోగి. కమలా..చాలా గొప్ప నేత అని, రాష్ట్రాభివృద్ధికి కోసం పాటుప‌డ్డ‌ట్లు కొనియాడారు. మంత్రి మ‌ర‌ణం నేప‌థ్యంలో రామ మందిర‌ ఫౌండేషన్ వేడుక సన్నాహాలను సమీక్షించ‌డానికి సీఎం ముందుగా ప్లాన్ చేసుకు‌న్న అయోధ్య ప‌ర్య‌ట‌ను ర‌ద్దు చేసుకున్నారు.

మే 3, 1958 న జన్మించిన కమలా రాణి వరుణ్ ప్ర‌స్తుతం ఉత్తర ప్రదేశ్ శాసనసభ స‌భ్యురాలిగా కొన‌సాగుతున్నారు. ఆమె పదకొండవ, పన్నెండవ లోక్సభ సభ్యురాలు కూడా. క‌మలా రాణి కాన్పూర్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో మాస్టర్స్ చదివారు . ఆమె 25 మే 1975 న కిషన్ లాల్ వరుణ్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది.

Read More : షోలో కన్నీటి పర్యంతమైన సోనూ సూద్