ఉత్తరప్రదేశ్లో దారుణం.. పెళ్లికి తీసుకెళ్లలేదని ఆత్మహత్య చేసుకున్న ఎనిమిదేళ్ల బాలిక
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పెళ్లికి తీసుకెళ్లలేదని 8 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్నగర్ జిల్లాలోని నిర్ధాణ గ్రామంలో బుధవారం ఎనిమిదేళ్ల బాలిక ఫ్యాన్కి ఉరేసుకొని మరణించింది.
Girl Hang Herself: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పెళ్లికి తీసుకెళ్లలేదని 8 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్నగర్ జిల్లాలోని నిర్ధాణ గ్రామంలో బుధవారం ఎనిమిదేళ్ల బాలిక ఫ్యాన్కి ఉరేసుకొని మరణించింది. పెళ్లికి తీసుకెళ్లేందుకు తల్లి వద్దన్నందుకు ఆ బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్హెచ్వో ధర్మేంద్ర సింగ్ తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ఆ బాలికకు అంత్యక్రియలు చేసినట్లు వెల్లడించారు. (ప్రభాస్ ‘ఆదిపురుష్’లో భాగం కానున్న లెజండరీ క్రికెటర్ తనయుడు.. ‘ఇంద్రజిత్’గా బాలీవుడ్ నటుడు)
పత్వి గ్రామంలో జరిగిన పెళ్లికి తీసుకెళ్లాలని తల్లిని కోరినప్పటికీ తనను కాకుండా సోదరుడిని తీసుకెళ్లినందుకు ఆ బాలిక మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు వివరించారు. దీనిపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. (ఫుట్బాల్ని మీరు మరింత అందంగా తీర్చిదిద్దారు.. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’కి భారతీయ ప్రముఖుల నివాళి)