తైవాన్ కి అమెరికా బృందం, కస్సుమన్న చైనా

తైవాన్ కి ఉన్నత స్థాయి అధికార బృందాన్ని పంపాలన్న అమెరికా యోచన పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బృందం అక్కడికి వెళ్తే తైవాన్ శాంతికి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఆక్రోశించింది.

తైవాన్ కి అమెరికా బృందం, కస్సుమన్న చైనా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 06, 2020 | 1:44 PM

తైవాన్ కి ఉన్నత స్థాయి అధికార బృందాన్ని పంపాలన్న అమెరికా యోచన పట్ల చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ బృందం అక్కడికి వెళ్తే తైవాన్ శాంతికి, సుస్థిరతకు భంగం వాటిల్లుతుందని ఆక్రోశించింది. 1979 నుంచే అమెరికా.. తైవాన్ కి దౌత్యపరమైన గుర్తింపునిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో యుఎస్ హెల్త్ చీఫ్ అలెక్స్ అజర్ ఆధ్వర్యాన ఓ ప్రతినిధి బృందాన్ని అక్కడికి పంపాలని అమెరికా యోచిస్తోంది. ఈ చిన్న దేశానికి అమెరికా ఆయుధాలను సప్లయ్ చేస్తున్నప్పటికీ.. అధికారికంగా దానితో కాంటాక్ట్ పెట్టుకోలేదు. అయితే ఆరేళ్ళ తరువాత తైవాన్ తో మళ్ళీ సంబంధాలు కొనసాగించాలన్న ఉద్దేశంతో.. యుఎస్ వీళ్ళను పంపే ప్రయత్నంలో ఉంది. కానీ..చైనా మాత్రం ఇందుకు వ్యతిరేకతను తెలియజేస్తూ.. తైవాన్ మీద మాకే హక్కు ఉందని, అది ఏనాటికైనా మాదేనని అడ్డంగా వాదిస్తోంది. ఇప్పటికే హాంకాంగ్ పై పెత్తనం చెలాయించడానికి బీజింగ్ చేస్తున్న యత్నాలతో చిరాకెత్తిన అమెరికా.. మా వాళ్ళను తైవాన్ కి పంపితీరుతామని పట్టు బట్టింది. మా అధికారులు అక్కడికి వెళ్తారని ప్రకటించింది.

దీంతో అమెరికా-చైనా మధ్య మళ్ళీ దౌత్య సంబంధాలు మరింత దిగజారనున్నాయి.