శ్వేత సౌధం నుంచి పాలరాతి కట్టడానికి.. ట్రంప్ కపుల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీన తన సతీమణితో కలిసి ప్రపంచంలోని ఏడో వింత అయిన తాజ్మహల్ను సందర్శించనున్నారు. అనంతరం అక్కడే ఒక రాత్రి బస చేయనున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్ కూడా వెళ్లనున్నారు. ట్రంప్ రాక సందర్భంగా.. తాజ్ పరిసరాలతో పాటు అహ్మదాబాద్లో కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన పనులను సీఎం యోగి ఆదిత్యానాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే.. ఖేరియా ఎయిర్పోర్ట్ నుంచి […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల 24వ తేదీన తన సతీమణితో కలిసి ప్రపంచంలోని ఏడో వింత అయిన తాజ్మహల్ను సందర్శించనున్నారు. అనంతరం అక్కడే ఒక రాత్రి బస చేయనున్నారు. ఆ తర్వాత అహ్మదాబాద్ కూడా వెళ్లనున్నారు. ట్రంప్ రాక సందర్భంగా.. తాజ్ పరిసరాలతో పాటు అహ్మదాబాద్లో కూడా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. దీనికి సంబంధించిన పనులను సీఎం యోగి ఆదిత్యానాథ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
అలాగే.. ఖేరియా ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ పరిసర ప్రాంతాల వరకూ అన్ని రూట్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. ఢిల్లీలోని ప్రధాన కూడళ్లని అందంగా తీర్చిదిద్దుతున్నారు. గోడలకి పలు రకాల పెయింట్స్ వేస్తున్నారు. కాగా ఇప్పటికే అమెరికాకు చెందిన భద్రతా బలగాలు తాజ్ మహల్ను సందర్శించాయి. ట్రంప్ రాక సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వం నగర సుందరీకరణకు భారీగా ఖర్చు చేస్తోంది. ఆయనకు, ఆయన వెంట వచ్చే ప్రతినిధి బృందానికి సమకూర్చే ఏర్పాట్లకు దాదాపు 100 కోట్ల వరకూ ఖర్చు పెడతారని తెలుస్తోంది.