ఏపీ పాలిటిక్స్లో మళ్ళీ బొత్స వ్యాఖ్యల కలకలం
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఏపీలో మరోసారి రాజకీయ రచ్చకు తెరలేపాయి. రాజధాని తరలింపు ఆల్ రెడీ ప్రారంభమైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో విపక్షాలు ఉలిక్కిపడ్డాయి. విశాఖ పట్నానికి సచివాలయంతోపాటు పలు శాఖల అధిపతుల కార్యాలయాల తరలింపు ఆల్ రెడీ మొదలైందని బొత్స ఇటీవల వ్యాఖ్యనించారు. అయితే.. మండలిలో తిరస్కరించిన రాజధానుల వికేంద్రీకరణపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానులంటూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన […]
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఏపీలో మరోసారి రాజకీయ రచ్చకు తెరలేపాయి. రాజధాని తరలింపు ఆల్ రెడీ ప్రారంభమైందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో విపక్షాలు ఉలిక్కిపడ్డాయి. విశాఖ పట్నానికి సచివాలయంతోపాటు పలు శాఖల అధిపతుల కార్యాలయాల తరలింపు ఆల్ రెడీ మొదలైందని బొత్స ఇటీవల వ్యాఖ్యనించారు. అయితే.. మండలిలో తిరస్కరించిన రాజధానుల వికేంద్రీకరణపై ప్రభుత్వం ఎలా ముందుకు వెళుతుందని టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ఏపీకి మూడు రాజధానులంటూ విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించిన దరిమిలా ఏపీ వ్యాప్తంగా రాజకీయ రచ్చ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును అసెంబ్లీలో జగన్ ప్రభుత్వం నెగ్గించుకోవడం.. అదే బిల్లు మండలిలో తిరస్కరణకు గురి కావడం చకచకా జరిగిపోయాయి. అయితే.. మండలినే రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ బిల్లును తిరస్కరించినా పెద్దగా ఉపయోగం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే రాజధానుల తరలింపులో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ రాజధాని తరలింపు ప్రాసెస్ మొదలైపోయిందని వ్యాఖ్యానించారు. బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రిపదవిలో వుండి మండలి తిరస్కరించిన అంశాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు ఎలా వున్నా.. రాజధాని తరలింపు దిశగా అడుగులు వడివడిగానే పడుతున్నాయని, దాన్ని ఎవరూ ఆపలేరని వైసీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.