దేవుడి భూమికోసం, యూపీలో పూజారిపై హత్యాయత్నం
రాజస్తాన్ లో ఓ పూజారి సజీవదహనం ఘటన మరువక ముందే యూపీలో ఒక పూజారిపై హత్యాయత్నం జరిగింది. లక్నోకు సుమారు 117 కి.మీ.దూరంలోని గోండా సిటీలో సామ్రాట్ దాస్ అనే పూజారి మీద దుండగులు కాల్పులు జరిపారు. రాజస్తాన్ లో మాదిరే ఇది కూడా భూవివాదానికి సంబంధించినదే. గోండా సిటీలో రామాలయ పూజారిగా వ్యవహరిస్తున్న సామ్రాట్ పై ఈ గుడి సమీపంలోనే హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఆలయానికి సుమారు 100 బీఘాల భూమి ఉందని, […]
రాజస్తాన్ లో ఓ పూజారి సజీవదహనం ఘటన మరువక ముందే యూపీలో ఒక పూజారిపై హత్యాయత్నం జరిగింది. లక్నోకు సుమారు 117 కి.మీ.దూరంలోని గోండా సిటీలో సామ్రాట్ దాస్ అనే పూజారి మీద దుండగులు కాల్పులు జరిపారు. రాజస్తాన్ లో మాదిరే ఇది కూడా భూవివాదానికి సంబంధించినదే. గోండా సిటీలో రామాలయ పూజారిగా వ్యవహరిస్తున్న సామ్రాట్ పై ఈ గుడి సమీపంలోనే హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఆలయానికి సుమారు 100 బీఘాల భూమి ఉందని, ఆ స్థలంపై కన్నేసిన దుండగులు దాన్ని చేజిక్కించుకునేందుకు ఈ పూజారిని హత్య చేయబోయారని ఖాకీలు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సామ్రాట్ దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.