లడ్డూలు పెట్టే భార్య.. విడాకులు కోరిన భర్త..
ఉత్తర్ ప్రదేశ్లో వింతైన ఘటన చోటుచేసుకుంది. ప్రతి రోజు భార్య లడ్డూలు పెడుతుందని.. తనకు విడాకులిప్పించండీ అంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. అతను చెప్పిన కారణం విని అంతా షాక్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఓ జంటకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి ఆరోగ్యం బాగుచేయాలని ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. ప్రతిరోజూ, రెండుపూటలా లడ్డూలు తినిపిస్తే అతడు తిరిగి ఆరోగ్యవంతుడు […]
ఉత్తర్ ప్రదేశ్లో వింతైన ఘటన చోటుచేసుకుంది. ప్రతి రోజు భార్య లడ్డూలు పెడుతుందని.. తనకు విడాకులిప్పించండీ అంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. అతను చెప్పిన కారణం విని అంతా షాక్ అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఓ జంటకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడని.. అతడి ఆరోగ్యం బాగుచేయాలని ఓ తాంత్రికుడిని ఆశ్రయించింది. ప్రతిరోజూ, రెండుపూటలా లడ్డూలు తినిపిస్తే అతడు తిరిగి ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పాడు. తాంత్రికుడి మాటలు నమ్మిన ఆమె.. భర్తకు చుక్కలు చూపించింది. ఈ నరకాన్ని తట్టుకోలేని భర్త ఆమె పై కోప్పడ్డాడు. మీ ఆరోగ్యం కోసమే ఇదంతా చేస్తున్నాను అంటూ.. ఆమె మొండి పట్టు పట్టింది. చివరికి తట్టుకోలేక తనకు విడాకులు ఇప్పించండీ అంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. కాపురం కూలిపోయే స్థితికి వచ్చినా భార్య మాత్రం వెనక్కుతగ్గలేదు. ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చేందుకు కోర్టు మరో మార్గం ద్వారా ప్రయత్నిస్తోంది.