సీఎం నిర్ణయం: 35 లక్షల మంది కూలీలకు రోజుకు వెయ్యి..
కరోనా కల్లొలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. వైరస్ విస్తరించకుండా పటిష్ట జాగ్రత్త చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా అనేక ఆంక్షాలు అమలు చేస్తోంది. అవసరముంటేనే...
కరోనా కల్లొలం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తతో వ్యవహరిస్తున్నాయి. వైరస్ విస్తరించకుండా పటిష్ట జాగ్రత్త చర్యలు చేపడుతోంది. దేశవ్యాప్తంగా అనేక ఆంక్షాలు అమలు చేస్తోంది. అవసరముంటేనే బయటకు రావాలని ప్రభుత్వాలు ప్రజలను ఆదేశించాయి. దీంతో ప్రతి ఒక్కరూ నివాసాలకే పరిమితం అవుతున్నారు. అన్ని పనులు వాయిదా వేడయంతో.. దినసరి కూలీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ క్రమంలోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునే దిశగా విస్తృత కార్యాచరణ సిద్దం చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే, రెక్కాడితే గానీ డొక్కాడని రోజువారి కూలీలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆఫర్ ప్రకటించారు. యూపీలోని 15 లక్షల మంది రోజువారి కూలీలతో పాటు భవన నిర్మాణ రంగంలో పని చేసే 20.37 లక్షల మంది కార్మికులకు రోజుకు రూ. వెయ్యి చొప్పున ఇస్తామని యోగి స్పష్టం చేశారు. ఈ డబ్బు.. కూలీల నిత్యవసర సరుకులకు, పనులకు ఉపయోగపడుతుందని యూపీ సీఎం పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 23 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 9 మంది కోలుకున్నట్లుగా అక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
Chief Minister Yogi Adityanath: Rs 1000 each will be given 15 lakh daily wage labourers and 20.37 lakh construction workers to help them meet their daily needs https://t.co/CRxZkoaHEt
— ANI UP (@ANINewsUP) March 21, 2020