కాన్పూర్ కాల్పుల్లో అమరులైన.. పోలీసు కుటుంబాలకు రూ. కోటి పరిహారం..
గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పట్టునేందుకు వెళ్లి క్రిమినల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్
గ్యాంగ్స్టర్ వికాస్ దూబేను పట్టునేందుకు వెళ్లి క్రిమినల్స్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఎనిమిది మంది పోలీసుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పెన్షన్తో పాటు, ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు.
ఈ ఘటనలో మృతిచెందిన పోలీసులకు నివాళులర్పించేందుకు యూపీ సీఎం యోగి కాన్పూర్ వెళ్లారు. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు కాన్పూర్ కాల్పులపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలీసుల ధైర్య సాహసాలను కొనియాడుతూ.. నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని పలువురు నేతలు కోరారు.