మీరు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకుంటే, బీహారీలకు యోగి ఆదిత్యనాథ్ ‘హామీ’

‘మీరు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యే  అవుతాడు.మిమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్లి అక్కడ రామాలయ సందర్శనం చేయిస్తాడు” ఇదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ ఓటర్లకు ఇచ్చిన హామీ !  బీహార్ ఎన్నికల  ప్రచారానికి  మంగళవారం వచ్చిన ఆయన..రామ్ గఢ్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ…త్రేతా యుగంలో ఈ రామ్ గడ్ ప్రాంతాన్ని రాముడు తన తపోస్థలిగా చేసుకున్నాడని  పురాణ కథ ఒకటి చెప్పారు. ఆ రాముడికే అయోధ్యలో అద్భుతమైన ఆలయ నిర్మాణం […]

మీరు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకుంటే, బీహారీలకు యోగి ఆదిత్యనాథ్ 'హామీ'
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2020 | 7:34 PM

‘మీరు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ఆయన ఎమ్మెల్యే  అవుతాడు.మిమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్లి అక్కడ రామాలయ సందర్శనం చేయిస్తాడు” ఇదీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీహార్ ఓటర్లకు ఇచ్చిన హామీ !  బీహార్ ఎన్నికల  ప్రచారానికి  మంగళవారం వచ్చిన ఆయన..రామ్ గఢ్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ…త్రేతా యుగంలో ఈ రామ్ గడ్ ప్రాంతాన్ని రాముడు తన తపోస్థలిగా చేసుకున్నాడని  పురాణ కథ ఒకటి చెప్పారు. ఆ రాముడికే అయోధ్యలో అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతోందని, మీరు బీజేపీ అభ్యర్థిని ఎన్నుకుంటే ఆయన ఆ ఆలయ దర్శనం చేయిస్తాడని వినూత్నమైన హామీ ఇచ్చారు యోగి. ఉగ్రవాదాన్ని మోదీ ప్రభుత్వం అంతమొందించిందని, బాలాకోట్ లో వైమానిక దాడుల ద్వారా పాకిస్థాన్ కి గట్టి గుణపాఠం చెప్పామని అన్నారు. తాము దేశం గురించి మాట్లాడితే ప్రతిపక్షాలు మతం గురించి మాట్లాడతాయని , అందువల్లే టెర్రరిజం, నక్సలిజం పెరిగిపోతున్నాయని అన్నారు. పశుగ్రాసం తినేవారిని ప్రజలు ఛీ కొడతారని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ని ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.