రైల్వే స్టేషన్ పేరునే మార్చేసిన ఆకతాయిలు
మహారాష్ట్రలో దుండగులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు ప్లాట్ ఫారం మీద ఉన్న బోర్డుపై ఉన్న పేరునే మార్చేశారు. ఔరంగాబాద్ పేరుపై రంగు పూసి.. దానిపై సంభాజీ నగర్ అని రాశారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. […]
మహారాష్ట్రలో దుండగులు రెచ్చిపోయారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు ప్లాట్ ఫారం మీద ఉన్న బోర్డుపై ఉన్న పేరునే మార్చేశారు. ఔరంగాబాద్ పేరుపై రంగు పూసి.. దానిపై సంభాజీ నగర్ అని రాశారు. ఈ ఘటనపై పోలీసులు, రైల్వే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నారని తెలిపారు. బోర్డుపై మొదట రంగు పూశారని.. ఆ తర్వాత సంభాజీనగర్ అనే పేరు ఉన్న స్టిక్కర్ను అతికించారని వెల్లడించారు.
@AbadCityPolice please look in to this and refer it to Railway police to book case. some miscreants are trying to change the name of #Aurangabad at Railway station. pic.twitter.com/JOHSi30fB8
— Shaikh Zeeshan (@iamzzeeshan) June 30, 2019