ఉత్తరాంధ్రలో ఇంటింటికి వంటగ్యాస్..మోదీ సర్కార్ గుడ్ న్యూస్
ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లోని తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిదివేల ఇళ్లకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ.. పైప్లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ […]
ఉత్తరాంధ్రలో మూడు జిల్లాల్లోని తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిదివేల ఇళ్లకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్), కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో తెలిపారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బుధవారం సమాధానమిస్తూ.. పైప్లైన్ ద్వారా ఇంటికి వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్టు కోసం ఐఓసిఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
సెలెక్ట్ చేసిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ (సిజిడి) ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (పిఎన్జిఆర్బి) కు ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ హక్కుల కోసం 9 వ రౌండ్ వేలం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ను అభివృద్ధి చేయడానికి, నిర్వహించడానికి ఐఓసిఎల్ హక్కులు సంపాదించిందని వివరించారు. ఈ పనుల్లో భాగంగా.. ఐఒసిఎల్ ఇప్పటికే హుక్-అప్ సౌకర్యాలు, సిటీ గ్యాస్ స్టేషన్తో పాటు పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు.