మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి సామాన్య ప్రజానీకంతో పాటు.. ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా కేంద్ర మంత్రులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకిన..
కరోనా మహమ్మారి సామాన్య ప్రజానీకంతో పాటు.. ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. తాజాగా కేంద్ర మంత్రులను కూడా వదలడం లేదు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. తాజాగా.. బుధవారం నాడు కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ పాద యశోనాయక్కు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “బుధవారం నాడు కరోనా పరీక్షలు చేయించుకోగా.. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నాను. ఇటీవల నాతో పలు కార్యక్రమాల్లో వేదికను పంచుకున్న వారితో పాటు.. నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి” అంటూ కేంద్ర మంత్రి శ్రీపాద కోరారు.
Union Minister of State for AYUSH Shripad Y Naik announces he has tested positive for #COVID19. pic.twitter.com/ZmK2EPzKsf
— ANI (@ANI) August 12, 2020
Read More :