కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. మెల్లమెల్లగా అన్ని వర్గాలను తాకుతుంది. కరోనా రాకాసి బారినపడుతన్న కేంద్ర మంత్రుల జాబితా క్రమంగా పెరుగుతుంది.
దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తుంది. మెల్లమెల్లగా అన్ని వర్గాలను తాకుతుంది. కరోనా రాకాసి బారినపడుతన్న కేంద్ర మంత్రుల జాబితా క్రమంగా పెరుగుతుంది. తాజాగా మరో కేంద్ర మంత్రికి కరోనా నిర్ధారణ అయ్యింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రల్హాద్ జోషికి కరోనా పాజిటివ్ సోకింది. కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే, తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, హోమ్ క్వారంటైన్లో ఉంటూ వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. కర్ణాటకకు చెందిన ప్రల్హాద్ జోషి, కరోనా నేపథ్యంలో గత నెలలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
కాగా, ఇటీవల పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కైలాష్ చౌదరి సహా పలువురు కేంద్ర మంత్రులు కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు.
ಆತ್ಮೀಯರೆ ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ ನನಗೆ ಸೋಂಕು ದೃಢಪಟ್ಟಿದೆ. ಯಾವುದೇ ರೋಗ ಲಕ್ಷಣಗಳು ಇರುವದಿಲ್ಲ. ವೈದ್ಯರ ಸಲಹೆಯಂತೆ ಹೋಮ್ ಕ್ವಾರಂಟೈನ್ ಆಗಿದ್ದೇನೆ.
I have tested positive for #COVID19 . As I am asymptomatic, as per doctor’s advise I am in home quarantine.
— Pralhad Joshi (@JoshiPralhad) October 7, 2020