అప్పడాలు తినండి…కరోనాను తరిమేయండి!
కరోనా మహమ్మారే కాదు, దాని జేజేమ్మ కూడా మనల్ని ఏమీ చేయలేదిప్పుడు...రెండు మూడు భాబీజీ పాపడ్లు తింటే సరిపోతుంది! ఈ మాటన్నది సాక్షాత్తు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్... కరోనా విరుగుడు వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆపసోపాలు పడుతుంటే ఆయనేమో పాపడ్ తింటే వైరస్ పరార్ అంటున్నారు..
కరోనా మహమ్మారే కాదు, దాని జేజేమ్మ కూడా మనల్ని ఏమీ చేయలేదిప్పుడు…రెండు మూడు భాబీజీ పాపడ్లు తింటే సరిపోతుంది! ఈ మాటన్నది సాక్షాత్తు కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్… కరోనా విరుగుడు వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆపసోపాలు పడుతుంటే ఆయనేమో పాపడ్ తింటే వైరస్ పరార్ అంటున్నారు..ఆయన చెప్పిన ఈ రెండు ముక్కలే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్న ఈ మంత్రివర్యులు ఈ వీడియోలో పాపడ్ను చూపిస్తూ కనిపించారు…కనిపించడమే కాదు ఈ పాపడ్లు కరోనాతో పోరాడే యాంటీ బాడీలను తయారు చేస్తాయని చెప్పుకొచ్చారు..దాంతో పాటు భాబీజీ పాపడ్ ఉత్పత్తిదారులపై అభినందనలు, ప్రశంసలు కురిపించారు కూడా! కేంద్రమంత్రే అంతమాటన్నాక కంపెనీ మాత్రం ఊరుకుంటుందా? తమ ఉత్పత్తుల్లో కరోనా వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణాలున్నాయని బికనీర్కు చెందిన ఆ కంపెనీ గొప్పలు చెప్పుకుంది! ఠాట్…ఇది నమ్మబుల్గా లేదు..ఇలా అసత్య, ఆశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తారా అంటూ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ను నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.