కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. 2019-2020 సంవ‌త్స‌రానికి ప్రొడ‌క్టివిటీ, నాన్‌-ప్రొడ‌క్టివిటీ రూపంలో బోన‌స్ ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Oct 21, 2020 | 5:21 PM

Bonus for Central Government Employees: కేంద్ర ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది. 2019-2020 సంవ‌త్స‌రానికి ప్రొడ‌క్టివిటీ, నాన్‌-ప్రొడ‌క్టివిటీ రూపంలో బోన‌స్ ఇచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన‌ట్లు కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ వెల్లడించారు. బోన‌స్ ప్ర‌క‌ట‌న వ‌ల్ల సుమారు 30 ల‌క్ష‌ల నాన్‌-గెజిటెడ్ ఉద్యోగులు ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.

దీని వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాపై సుమారు రూ. 3737 కోట్ల భారం పడనుందని తెలిపారు. బోన‌స్‌ను సింగిల్ ఇన్‌స్టాల్మెంట్ ప‌ద్ధ‌తిలో ఇవ్వనున్నారు. విజ‌య‌ద‌శ‌మిలోగా నేరుగా ఆ మొత్తాన్ని బ‌దిలీ చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు.

మంత్రి మండ‌లి స‌మావేశంలో తీసుకున్న మరికొన్ని ఇత‌ర నిర్ణ‌యాల గురించి కూడా కేంద్ర మంత్రి జ‌వ‌దేక‌ర్ తన ప్ర‌క‌ట‌నలో తెలిపారు. జమ్ముకశ్మీర్  పంచాయ‌తీ రాజ్ చ‌ట్టాన్ని ఆమోదించిన‌ట్లుగా పేర్కొన్నారు. ఈ చ‌ట్టం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాల త‌ర‌హాలో క‌శ్మీర్‌లోనూ ప్ర‌జాస్వామ్యం వ‌ర్థిల్లుతుంద‌న్నారు. రైల్వే, పోస్ట‌ల్‌, ఈపీఎఫ్‌వో లాంటి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ ఉద్యోగుల‌కు వారంలోగా బోన‌స్ అందిచ‌నున్నారు.