కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ కారుకు ప్రమాదం.. భార్య మృతి.. ఇప్పటివరకు అందిన వివరాలు ఇవి
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక అంకోలా జిల్లా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ భార్య విజయ మరణించారు.
కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటక అంకోలా జిల్లా సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీపాద్ నాయక్ భార్య విజయ మరణించారు. మంత్రి శ్రీపాద్ నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం నలుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాయక్ పర్సనల్ సెక్రటరీ దీపక్ రామ్దాదా గోమ్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీపాద్ నాయక్ కేంద్ర ఆయుర్వేద, యోగా & ప్రకృతివైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి మంత్రిత్వ శాఖా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Also Read :
Daily essentials: సామాన్యులకు మరో షాక్.. పెరగనున్న వంట నూనె , సబ్బులు, బిస్కెట్ల ధరలు
Andhra Pradesh Ration: ఏపీలో ఇకపై ఓటీపీ చెబితేనే రేషన్.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి కొత్త విధానం..