ప్లాస్టిక్ వినియోగం తగ్గించడమే లక్ష్యం.. యూనిలీవర్ కీలక ప్రకటన
ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్ధ యూనిలీవర్ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ 2025 నాటికి ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించేందుకు నిర్ణయించినట్టు యూనిలీవర్ సీఈఓ అలెన్ జోప్ వెల్లడించారు. తాము విక్రయించే ప్లాస్టిక్ కంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి సమీకరించి ప్రాసెస్ చేయడానికి సంస్ధ కృషి చేయనున్నట్టు తెలిపారు. యూని లీవర్ సంస్ధ ఏడాదికి దాదాపు 7 లక్షల టన్నుల ప్లాస్టిక్ను తమ వస్తువుల ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తుంది. అయితే తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం మరెన్నో కంపెనీలకు […]
ప్రముఖ ఎఫ్ఎమ్సీజీ సంస్ధ యూనిలీవర్ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ 2025 నాటికి ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించేందుకు నిర్ణయించినట్టు యూనిలీవర్ సీఈఓ అలెన్ జోప్ వెల్లడించారు. తాము విక్రయించే ప్లాస్టిక్ కంటే ప్లాస్టిక్ వ్యర్ధాలను తిరిగి సమీకరించి ప్రాసెస్ చేయడానికి సంస్ధ కృషి చేయనున్నట్టు తెలిపారు.
యూని లీవర్ సంస్ధ ఏడాదికి దాదాపు 7 లక్షల టన్నుల ప్లాస్టిక్ను తమ వస్తువుల ప్యాకింగ్ కోసం ఉపయోగిస్తుంది. అయితే తాజాగా కంపెనీ తీసుకున్న నిర్ణయం మరెన్నో కంపెనీలకు ఆదర్శంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గిస్తామంటూ నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి సంస్ధగా యూనిలీవర్ ప్రశంసలు పొందుతోంది. ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. దీనితో పలుదేశాల్లో ఉన్న యూనిలీవర్ ఆపరేటర్లు సైతం ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. 2025 నాటికి 25 శాతం రీసైక్లింగ్ ప్లాస్టిక్ను తమ ఉత్పత్తుల కోసం ఉపయోగిస్తామని కంపెనీ సీఈవో అలెన్ జోప్ తెలిపారు.