నీటి అడుగున రెస్టారెంట్… భోజనం రూ. 30 వేలు

నార్వేలో సముద్రంలో ఒక అద్భుతమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఒక వైపు  బాహ్య ప్రపంచం.. మరోవైపు సముద్రంలోని దృశ్యాలు కనిపిస్తాయి. ఇక లేట్ ఎందుకు.. ఒకసారి మనం కూడా ఆ వింత రెస్టారెంట్ ను చూద్దాం.   ‘Under’ పేరుతో యూరోప్ లో తొలి రెస్టారెంట్ గా ప్రారంభమైంది. రియల్ లైఫ్ థ్రిల్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు. నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ […]

నీటి అడుగున రెస్టారెంట్... భోజనం రూ. 30 వేలు
Follow us

|

Updated on: Mar 29, 2019 | 3:52 PM

నార్వేలో సముద్రంలో ఒక అద్భుతమైన రెస్టారెంట్ ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్ ప్రత్యేకత ఏంటంటే.. ఒక వైపు  బాహ్య ప్రపంచం.. మరోవైపు సముద్రంలోని దృశ్యాలు కనిపిస్తాయి. ఇక లేట్ ఎందుకు.. ఒకసారి మనం కూడా ఆ వింత రెస్టారెంట్ ను చూద్దాం.

  • ‘Under’ పేరుతో యూరోప్ లో తొలి రెస్టారెంట్ గా ప్రారంభమైంది. రియల్ లైఫ్ థ్రిల్ మిస్ కాకుండా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుందని పర్యాటకులు అంటున్నారు.

  • నార్వేలోని నార్త్ సీని లింక్ చేస్తూ కాంక్రీట్ ట్యూబ్ నిర్మించారు. స్నో హెట్టా అనే సంస్థ ఈ రెస్టారెంట్ ను నిర్మించింది.

  • కాగా ఈ రెస్టారెంట్ మార్చి 20న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ హోటల్ ప్రీ-బుకింగ్ లో అప్పటికే 7000 మంది బుక్ చేసుకోవడం విశేషం.

  • రెస్టారెంట్ లో కూర్చుని ఒకవైపు భోజనం చేస్తూ.. సముద్రంలో ఉండే వింతలను మరోవైపు ఎంజాయ్ చేయవచ్చు. ఇదో వింత అనుభూతి అని కొంతమంది పర్యాటకులు కూడా అన్నారు.

  • ఈ రెస్టారెంట్‌లో ఒకేసారి 35-40 మంది కూర్చొని భోజనం చేయవచ్చట. ఇందులో వడ్డించే భోజనం కూడా సముద్ర వంటకాలే ఉండటం విశేషం. కాగా ఒక భోజనం ధర 380 యూరోలు. మన భారత కరెన్సీలో సుమారు రూ.30 వేలు