బాల్ తగిలి..అంపైర్ దుర్మరణం
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ పొందుతోన్న ఆట. ఈ గేమ్ ఎంత వినోదాన్ని ఇస్తుందో..కొన్నిఅనుకోని సంఘటనలు అంతే విషాదాన్ని మిగులుస్తాయి. నెలరోజుల క్రితం లండన్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో బంతి తగిలి ఆసుపత్రిలో చేరాడు అంపైర్ జాన్ విలియమ్స్. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మరణించాడు. జులై 13న పెమ్బ్రోక్ – నార్బెత్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అంపైర్ మరణించిన విషయాన్ని పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ మ్యాచ్లో అంపైర్ […]
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ పొందుతోన్న ఆట. ఈ గేమ్ ఎంత వినోదాన్ని ఇస్తుందో..కొన్నిఅనుకోని సంఘటనలు అంతే విషాదాన్ని మిగులుస్తాయి. నెలరోజుల క్రితం లండన్లో జరిగిన కౌంటీ మ్యాచ్లో బంతి తగిలి ఆసుపత్రిలో చేరాడు అంపైర్ జాన్ విలియమ్స్. నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి గురువారం మరణించాడు. జులై 13న పెమ్బ్రోక్ – నార్బెత్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అంపైర్ మరణించిన విషయాన్ని పెమ్బ్రోక్షైర్ క్రికెట్ క్లబ్ ట్విట్టర్లో తెలిపింది. ఆ మ్యాచ్లో అంపైర్ జాన్ తలకు బంతి తగిలి తీవ్ర గాయమైంది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం హావర్ఫోర్డ్వెస్ట్లోని మరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Sad news this morning regarding umpire John Williams.
John passed away this morning with his family at his bedside. Thoughts of all of Pembrokeshire Cricket are with Hilary and the boys at this difficult and sad time
— Pembrokeshire Cricket ? (@PembsCricket) August 15, 2019