Breaking: బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా
బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
Uma Bharti Corona: బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతికి కరోనా సోకింది. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆమెకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. గత మూడు రోజులగా జ్వరంతో బాధపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల తాను హిమాలయాలకు వెళ్లినపుడు సామాజిక దూరం సహా కరోనా నిబంధనలను పాటించానని, అయినా కరోనా సోకిందని ఆమె పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ అయిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. ” ప్రస్తుతం హరిద్వార్, రిషికేశ్ మధ్య ఉన్న వందేమాతరం కుంజ్ వద్ద క్వారంటైన్లో ఉన్నా. నాలుగు రోజుల తర్వాత మరోసారి కరోనా పరీక్ష చేయించుకుంటా. పరిస్థితి ఇలాగే ఉంటే వైద్యులను సంప్రదిస్తా’ అని ఉమాభారతి ట్వీట్ చేశారు.
Read More:
కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నమూత