ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో బయట పడిన ఒకే ఒక్క కేడెట్
ఉక్రెయిన్ లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో 22 మంది మిలిటరీ కేడెట్లు మరణించగా, ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే వీరిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. దేశంలోని..
ఉక్రెయిన్ లో శుక్రవారం జరిగిన విమాన ప్రమాదంలో 22 మంది మిలిటరీ కేడెట్లు మరణించగా, ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అయితే వీరిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. దేశంలోని కార్కివ్ ప్రాంతంలో ఈ విమానం కూలిపోయే ముందు వీరిద్దరూ కిందకు దూకివేసినట్టు కార్కివ్ గవర్నర్ అలెక్సి కూచర్ తెలిపారు. కాగా ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ…మృతుల స్మృత్యర్థం దేశం శుక్రవారం సంతాప దినంగా పాటించిందని చెప్పారు. ఈ ఘోర ప్రమాదంలో ప్లేన్ ముక్కలుగా విడిపోయింది. అయితే ప్రమాదానికి కారణం తెలియలేదు.