కొవిడ్ నిర్దారణకు మరో కొత్త పరికరం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి ఇంకా తగ్గడంలేదు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొవిడ్ టెస్ట్ కోసం కొత్త కొత్త పరికరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాప్తి ఇంకా తగ్గడంలేదు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొవిడ్ టెస్ట్ కోసం కొత్త కొత్త పరికరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా కరోనా వైరస్ సోకిందని నిర్ధారించేందుకు మరో పరికరం ప్రపంచ మార్కెట్లోకి వస్తోంది. లండన్లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన స్పినౌట్ కంపెనీ ‘కోవిడ్ నడ్జ్టెస్ట్ బాక్స్’ అనే పరికరాన్ని రూపొందించింది. ఈ పరికరం ద్వారా ‘కొవిడ్ నడ్జ్ టెస్ట్’ను నిర్వహిస్తారు. మూడు గంటల్లోనే కోవిడ్ సోకిందా లేదా అనే విషయాన్ని ఈ పరికరం తేల్చేస్తుందట. 94 శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ‘కోవిడ్–టెస్ట్’ పరికరాలు 70 శాతమే ఖచ్చితమైన ఫలితాలనిస్తుండగా ఈ కొత్త పరికరం 94 శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుందని తయారీదారులు చెబుతున్నారు.
ఈ పరికరంలో క్యార్టిడ్జెస్ను ఉపయోగిస్తున్నట్లు తయారీదారులు చెబుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించినవారి ముక్కు నుంచి తీసీ స్లేష్మం, నోటి లాలాజలం తీసుకునే శాంపిల్స్ను ఈ క్యార్టిడ్జ్పై పరికరంలోకి పంపిస్తారు. అది వాటిని మూడు గంటల్లోగా విశ్లేషించి ఫలితాన్ని చెబుతుంది. దీని ధరను 30 పౌండ్లు అంటే దాదాపు 2,900 రూపాయలుగా నిర్ధారించారు, ‘కొవిడ్ నడ్జ్టెస్ట్ బాక్స్’గా పిలువబడే ఈ పరికరాన్ని లండన్లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన స్పినౌట్ కంపెనీ రూపొందించింది. అయితే, ఐదు వేల పరికరాలు, 58 లక్షల క్యార్టిడ్జ్ల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు బ్రిటన్ ఎన్హెచ్ఎస్ వర్గాలు తెలిపాయి.
ప్రధానంగా విద్యా సంస్థలు, థియేటర్లలో సులువుగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందంటున్నారు. వీటి కోసం ఆర్డర్లు ఇచ్చినప్పటికీ ఇంటి వద్ద పరీక్షలు చేసుకోవచ్చని ఎన్హెచ్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. సంగీత కచేరీలకు కూడా ఇవి బాగా ఉపయోగ పడుతున్నాయట. ఇటీవల లండన్లో జరిగిన సింఫని ఆర్కెస్ట్రా కచేరీలో కళాకారులందరికి ఈ పరికరాల ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు స్పినౌట్ కంపెనీ పేర్కొంది.