బ్రిటన్ నుంచి మళ్ళీ మన దేవతా విగ్రహాలు మనకు !
చోరీకి గురైన దేవతా విగ్రహాలు 40 ఏళ్ళ తరువాత మళ్ళీ మనకు చేరనున్నాయి. వాటిని భారత ప్రభుత్వానికి బ్రిటన్ అప్పగించబోతోంది. 1978 లో తమిళనాడు నాగపట్నం జిల్లా లోని అనంత మంగళం రాజగోపాలస్వామి ఆలయంలోని..
చోరీకి గురైన దేవతా విగ్రహాలు 40 ఏళ్ళ తరువాత మళ్ళీ మనకు చేరనున్నాయి. వాటిని భారత ప్రభుత్వానికి బ్రిటన్ అప్పగించబోతోంది. 1978 లో తమిళనాడు నాగపట్నం జిల్లా లోని అనంత మంగళం రాజగోపాలస్వామి ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఇవి ఎలా చేరాయోగానీ లండన్ చేరాయి, ఇన్నేళ్లకు ఈ విగ్రహాలు అక్కడ ఉన్నట్టు తమిళనాడు పోలీసులు గుర్తించడం, ఇవి ఈ ఆలయానివే అంటూ నాగపట్నం జిల్లా కలెక్టర్ ఆధారాలను బ్రిటన్ కు పంపడం జరిగింది. ఈ ఆధారాలు సరిపోలడంతో వీటిని లండన్ అధికారులు ఇక్కడికి తిప్పి పంపనున్నారు. వీటి అప్పగింతకు ముందు లండన్ లోని శ్రీమురుగన్ ఆలయ పూజారులు కొద్దిసేపు ఈ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అక్కడి భారత హైకమిషనర్ గైత్రి ఇస్సార్ కుమార్ ఆధ్వర్యంలో వీటి అప్పగింత జరిగింది. వీటిని త్వరలో ఆలయంలో ప్రతిష్టించనున్నారు.