రాజ్‌భవన్‌లో రేపు ఉగాది వేడుకలు

హైదరాబాద్‌ : ఈ నెల 5వ తేదీన సాయంత్రం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ ఉగాది వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొననున్నారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 6న ఉదయం 10:30 గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందుకు […]

రాజ్‌భవన్‌లో రేపు ఉగాది వేడుకలు
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 6:23 PM

హైదరాబాద్‌ : ఈ నెల 5వ తేదీన సాయంత్రం రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు జరగనున్నాయి. ఈ ఉగాది వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొననున్నారు. వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 6న ఉదయం 10:30 గంటలకు రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే వికారి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందుకు ప్రగతి భవన్‌ జనహితలో కాకుండా రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలను నిర్వహిస్తోంది.