లోయలో కొనసాగుతున్న ఉగ్రవేట. ఇద్దరు ముష్కరులు హతం..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య నిత్యం ఎక్కడో ఓ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంటుంది. తాజాగా శ్రీనగర్లోని రణ్బీర్గర్ ప్రాంతలో ఉగ్రవాదులు ఉన్నారన్న..
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య నిత్యం ఎక్కడో ఓ ప్రాంతంలో ఎన్కౌంటర్ చోటుచేసుకుంటుంది. తాజాగా శ్రీనగర్లోని రణ్బీర్గర్ ప్రాంతలో ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారం అందడంతో.. భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో వీరిని చూసిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తెల్లవారు జామునుంచి ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని జమ్ముకశ్మీర్ ఆర్మీ సెక్టార్ 10 కమాండర్ నరేష్ మిశ్రా తెలిపారు. మరికొంత మంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోందని.. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.
Two terrorists have been neutralised in the encounter in Ranbirgarh. Search operation underway. The identity of the terrorists can not be confirmed for now: Naresh Mishra, Army 10 Sector Commander #JammuandKashmir
(Visuals deferred by unspecified time) pic.twitter.com/EH7IEkzokr
— ANI (@ANI) July 25, 2020