తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్..

తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ సృష్టిస్తోన్న క‌రోనా.. పెరుగుతోన్న కేసుల సంఖ్య‌
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2020 | 8:15 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లోనూ ప‌లు కంటైన్మెంట్ జోన్ల‌లో లాక్ డౌన్ పొడిగించాయి ప్ర‌భుత్వాలు. ముందుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు మార్క్ దాటాయి. గ‌డిచిన 24 గంటల వ్యవధిలో 10,171 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,960కి చేరింది. కరోనాతో కొత్త‌గా 89 మంది ప్రాణాలు విడిచారు. కొవిడ్​తో ఇప్పటివరకు రాష్ట్ర‌వ్యాప్తంగా 1,842 మంది చ‌నిపోయారు. రాష్ట్రంలో వ్యాధి నుంచి 1,20,464 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,654 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. గ‌డిచిన‌ 24 గంటల వ్యవధిలో 62,938 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు మొత్తం 23.62 లక్షల మందికి కరోనా టెస్టులు చేసిన‌ట్టు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త‌గా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరిలో 1,270, అనంతపురంలో 1,100, చిత్తూరులో 980, నెల్లూరులో 941, విశాఖలో 852, గుంటూరులో 817, కడపలో 596, పశ్చిమగోదావరిలో 548, విజయనగరంలో 530, శ్రీకాకుళంలో 449, కృష్ణాలో 420, ప్రకాశం జిల్లాలో 337లో కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75,257కి చేరింది. ఇందులో 21,417 యాక్టివ్ కేసులు ఉండగా.. 53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గరిచిన 24 గంటల్లో 1136 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 601కి చేరింది.

నిన్న ఒక్క రోజే 23,495 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 5,66,984కి చేరింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 532, రంగారెడ్డిలో 196, వరంగల్ అర్బన్ 142, మేడ్చల్ 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, గద్వాల్ 87, కామారెడ్డి 96, కరీంనగర్ 93, ఖమ్మం 85, నిజామాబాద్ 89, పెద్దపల్లి 71 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More:

48 గంట‌లు అన్నీ బంద్‌.. పుట్ట‌ప‌ర్తిలో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

నేడు, రేపు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు

ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..