శివాలయంలో సాధువుల హత్య.. పగతోనే !

యూపీ లోని బులంద్ షహర్ లో గల శివాలయంలో ఇద్దరు సాధువుల  హత్య.. మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పనేనని తేలింది. ఈ గుడిలో ఉంటున్న ఈ సాధువుల చిడతలను మురళి అలియాస్ రాజు అనే వ్యక్తి దొంగిలించడంతో వారు అతడ్ని తీవ్రంగా మందలించారని

శివాలయంలో సాధువుల హత్య.. పగతోనే !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 28, 2020 | 12:51 PM

యూపీ లోని బులంద్ షహర్ లో గల శివాలయంలో ఇద్దరు సాధువుల  హత్య.. మద్యానికి బానిసైన ఒక వ్యక్తి పనేనని తేలింది. ఈ గుడిలో ఉంటున్న ఈ సాధువుల చిడతలను మురళి అలియాస్ రాజు అనే వ్యక్తి దొంగిలించడంతో వారు అతడ్ని తీవ్రంగా మందలించారని, దుర్భాషలాడారని తెలిసింది. దీంతో వారిపై పగ పెంచుకున్న రాజు.. సోమవారం రాత్రి కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. స్థానికుల ఫిర్యాదుపై రాజు కోసం పోలీసులు ఆ చుట్టుపక్కల అంతా గాలించారు. చివరకు ఒక చోట “భంగ్’ (నల్లమందు) సేవించి మత్తులో తూలుతున్న రాజు కనిపించాడని, అతడ్ని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వీడి మత్తు దిగగానే   జైలుకు పంపుతామని చెప్పారు. అయితే ఈ ఘటనకు మతం రంగు పులమరాదని వారు కోరారు. అటు- సాధువుల హత్య గురించిన సమాచారం తెలియగానే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. హంతకులెవరైనాసరే కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇటీవల మహారాష్ట్రలోని పాల్గర్ లో ఒక డ్రైవర్ తో సహా ఇద్దరు సాధువులను ఓ గుంపు కర్రలతో, రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చిన సంగతి విదితమే.. ఆ ఘటన మరువక ముందే తిరిగి ఈ సాధువుల మర్డర్ జరగడం తీవ్ర సంచలనం రేపింది. పాల్గర్ ఘటనలో 70 ఏళ్ళ ఓ సాధువు కూడా హతమయ్యాడు. ఆ ఘటనలో దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయి అడవుల్లో దాక్కున్న హంతకుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లను కూడా ఉపయోగించింది. దుండగుల్లో ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నట్టు తెలియడంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.