గాల్లోనే ఢీకొన్న 2 విమానాలు.. 8మంది మృతి
రోడ్లపై వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరగటం మనం ఎక్కువగా చూస్తుంటాం. లేదా వాహనాలు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటనలు చూస్తుంటాం. కొన్నిసార్లు ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢీకొనడం కూడా చూస్తుంటాం. కానీ, అక్కడ రెండు విమానాలు ఢీకొన్నాయి. గాల్లోనే ఢికొన్న ఆ రెండు విమానాలు...
రోడ్లపై వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరగటం మనం ఎక్కువగా చూస్తుంటాం. లేదా వాహనాలు అదుపుతప్పి బోల్తా కొట్టిన సంఘటనలు చూస్తుంటాం. కొన్నిసార్లు ఎదురెదురుగా వచ్చిన రైళ్లు ఢీకొనడం కూడా చూస్తుంటాం. కానీ, అక్కడ రెండు విమానాలు ఢీకొన్నాయి. గాల్లోనే ఢికొన్న ఆ రెండు విమానాలు అనంతరం అక్కడి సరస్సులో కూలిపోయాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పరిశీలించగా…
అమెరికాలోని ఇదాహో రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆదివారం (జులై 5 న)మధ్యాహ్నం రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. ప్రమాదంలో 8 మంది మరణించినట్లు విమానయాన అధికారులు వెల్లడించారు. సరస్సులో మునిగిపోతున్న విమానాల నుంచి ఒక్కో మృతదేహాన్ని వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. విమానాల నుంచి మరో ఆరుగురు సరస్సులో పడిపోయి మునిగిపోవడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూసినట్లు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు.
మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. విమానాలు గాల్లో ఢికొన్న దృశ్యాలను అక్కడున్న కొంతమంది స్థానికులు చూసినట్లుగా చెప్పారు. విమానాలు రెండు గాల్లోనే ఢీకొన్నాయని అనంతరం సరస్సుల్లో కూలిపోయినట్లుగా చెప్పారు. బోట్ల సాయంతో స్థానికులు రెండు మృతదేహలను వెలికితీశారు. మిగిలిన ఆరుగురి కోసం సహాయక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు. విమానాల శకలాలను వెలికితీయడానికి కూడా ఒకట్రెండు రోజులు పడుతుందని తెలిపిన అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో ఒక్కో విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు.