కరోనా మృతుడి అంత్యక్రియలకు వెళ్లిన ఇద్దరు మృతి
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. అవకాశం దొరికిన ఏ సందర్బాన్ని వదలకుండా ప్రజల్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఎటునుంచి వైరస్ సంక్రమిస్తోందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది.....
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. అవకాశం దొరికిన ఏ సందర్బాన్ని వదలకుండా ప్రజల్ని పట్టి పీడిస్తోంది. ఎప్పుడు ఎటునుంచి వైరస్ సంక్రమిస్తోందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో కరోనాతో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన ఇద్దరు కుటుంబసభ్యులు ఉన్నట్టుండి మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన జమ్మూలో చోటు చేసుకుంది. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమవారు మరణించారంటూ మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు పరిశీలించగా…
కరోనా సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన ఇద్దరూ కూడా అధికారుల సూచన మేరకు పీపీఈ కిట్లు ధరించారని, కానీ, వారికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఉంచడంతో వారు నీరసించి ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మృతుల్లో ఒకరికి 42 ఏళ్లు, కాగా మరొకరు 35ఏళ్ల వ్యక్తిగా చెబుతున్నారు. వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ, కొన్ని గంటలపాటు మంచినీళ్లు ఇవ్వకపోవడం, పీపీఈ కిట్లు ధరించి ఉండటంతో వారి శక్తి సన్నగిల్లిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే వాళ్లిద్దరూ మరణించారంటూ రోధించారు. కాగా, జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది.