సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. ఇద్దరు పైలట్లు మృతి

సోమవారం పాకిస్థాన్‌ ఎయిర్ క్రాఫ్ట్‌ ఒకటి గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్థాన్‌ పైలట్లు మృతిచెందారు. పాక్ డే పరేడ్‌ రిహార్సల్స్‌లో భాగంగా బయలుదేరిన ముష్షాక్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. కాసేపటికే పాకిస్థాన్‌-గుజరాత్ సరిహద్దుల్లో ప్రాంతంలో కుప్పకూలింది. ఆర్మీకి చెందిన మీడియా వింగ్‌.. ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ తెలిపిన ప్రకారం.. ఈ ఘటనలో ఇద్దరు పాక్ పైలట్లు మేజర్ ఉమేర్ ఇన్‌స్ట్రక్టర్‌ పైలట్‌, లెఫ్టినెంట్‌ ఫైజన్‌లు మరణించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గత […]

సరిహద్దుల్లో కుప్పకూలిన పాక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. ఇద్దరు పైలట్లు మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2020 | 4:46 PM

సోమవారం పాకిస్థాన్‌ ఎయిర్ క్రాఫ్ట్‌ ఒకటి గుజరాత్ రాష్ట్ర సరిహద్దుల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పాకిస్థాన్‌ పైలట్లు మృతిచెందారు. పాక్ డే పరేడ్‌ రిహార్సల్స్‌లో భాగంగా బయలుదేరిన ముష్షాక్‌ ట్రైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌.. కాసేపటికే పాకిస్థాన్‌-గుజరాత్ సరిహద్దుల్లో ప్రాంతంలో కుప్పకూలింది. ఆర్మీకి చెందిన మీడియా వింగ్‌.. ఇంటర్‌ సర్వీస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ తెలిపిన ప్రకారం.. ఈ ఘటనలో ఇద్దరు పాక్ పైలట్లు మేజర్ ఉమేర్ ఇన్‌స్ట్రక్టర్‌ పైలట్‌, లెఫ్టినెంట్‌ ఫైజన్‌లు మరణించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. గత నెల మార్చి 23న కూడా, ఎఫ్‌ 16 కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో వింగ్ కమాండర్ నౌమాన్ అక్రమ్ మృతిచెందారు. ఈ వరసు ఘటనలపై పాక్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.