ఘోర రోడ్డు ప్రమాదం.. పొగ మంచుతో ఆరుగురు దుర్మరణం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 మందితో ప్రయాణిస్తోన్న ఓ కారు ప్రమాదవ శాత్తూ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యావేక్షిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు. ఢిల్లీ నుంచి దంకౌర్ వైపు వెళ్తున్న […]

ఘోర రోడ్డు ప్రమాదం.. పొగ మంచుతో ఆరుగురు దుర్మరణం
Follow us

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:17 PM

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 11 మందితో ప్రయాణిస్తోన్న ఓ కారు ప్రమాదవ శాత్తూ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కాగా.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యావేక్షిస్తున్నారు. ఆదివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు అంచనా వేశారు. ఢిల్లీ నుంచి దంకౌర్ వైపు వెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా.. పొగమంచు కమ్ముకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు పోలీసులు.