లాంచీ మునక ప్రమాదంలో ఇద్దరు సురక్షితం

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో జరిగిన లాంచీ ప్రమాదంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చేపడుతున్నారు. చీకటి పడటంతో సహాయక..

లాంచీ మునక ప్రమాదంలో ఇద్దరు సురక్షితం
Follow us

| Edited By:

Updated on: Aug 21, 2020 | 12:13 AM

తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో జరిగిన లాంచీ ప్రమాదంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మరొకరి కోసం పోలీసులు, రెస్క్యూ టీం గాలింపు చేపడుతున్నారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. త్వరలోనే మూడో వ్యక్తిని కూడా కాపాడుతామంటూ పోలీసులు చెబుతున్నారు.

కాగా, చింతూరులోని శబరి నది బ్రిడ్జిని లాంచీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్‌ను ఢీకొనడంతో లాంచీ రెండు ముక్కలై.. మునిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే లాంచీ ప్రమాదానికి గురైన సమయంలో ముగ్గురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తున్నప్పటికీ.. పక్కా సమాచారం తెలియడం లేదు. వరద బాధితులకు నిత్యవసరాలను అందించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది.

Read More :

ఒడిషాలో 70 వేలకు చేరిన పాజిటివ్‌ కేసులు

మహారాష్ట్రలో మరో 117 పోలీసు సిబ్బందికి పాజిటివ్