తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆసిఫాబాద్ ఇస్గాం పీఎస్ పరిధిలోని కడంబ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
Follow us

|

Updated on: Sep 19, 2020 | 11:49 PM

తెలంగాణలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఆసిఫాబాద్ ఇస్గాం పీఎస్ పరిధిలోని కడంబ అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో రెండు తుపాకులు, విప్లవ సాహిత్యం, మావోయిస్టు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. భాస్కర్‌ అనే మరో కీలక నేత తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అతడి కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు  పోలీసులు.  ప్రస్తుతం మావోయిస్టులకు , గ్రే హౌండ్స్ దళాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Also Read :

ఏపీలో కల్తీ కూల్ డ్రింక్‌లు.. తస్మాత్ జాగ్రత్త !

తన ఇంటి గేట్లు పెకిలించివేసిన ‘ది రాక్’​