ఏఓబీలో భారీ ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు గ్రేహౌండ్ దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు మృతి చెందారు. విశాఖ జిల్లా రూరల్ గాలికొండ పెద్దబైలు అటవీ ప్రాంతం కాల్పులతో మర్మోగుతోంది. మావోయిస్టులకు గ్రేహౌండ్ దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సంఘటనా స్థలంలో మావోయిస్ట్ అగ్రనేతలు వున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఏపీలో విపరీతంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో […]
ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులకు గ్రేహౌండ్ దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు దళ సభ్యులు మృతి చెందారు. విశాఖ జిల్లా రూరల్ గాలికొండ పెద్దబైలు అటవీ ప్రాంతం కాల్పులతో మర్మోగుతోంది. మావోయిస్టులకు గ్రేహౌండ్ దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సంఘటనా స్థలంలో మావోయిస్ట్ అగ్రనేతలు వున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఏపీలో విపరీతంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఏఓబీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు నెలల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటివరకు జిల్లా కమిటీ సభ్యుడితో పాటు నలుగురు ఏరియా కమిటీ సభ్యులు సైతం ప్రాణాలు కోల్పోవడం మావోయిస్టులు కోలుకోలేని పరిస్థితి ఎదురైంది. మావోయిస్టులను 30 గ్రేహౌండ్ బృందాలు ప్రతిఘటిస్తున్నాయి