హిమాచల్లో దారుణం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి
హిమాచల్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మండీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మండీలోని హనోజీ దేవాలయం..
హిమాచల్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. మండీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా శుక్రవారం ఉదయం మండీలోని హనోజీ దేవాలయం సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పలు వాహానాలపై కొండచరియలు విరిగిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుల్లూ మార్గంలో నిత్యవసర సరకులు తీసుకెళ్తున్న వాహానాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు.. దేవాలయం పక్కనే పార్కింగ్ చేసిన వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా స్థానిక కాలువలు పొంగిపొర్లుతున్నాయి. పాగల్ నాలా పొంగి ప్రవహిస్తోంది. దీంతో కుల్లూ జిల్లాలో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Himachal Pradesh: Two killed, three injured after three vehicles were hit by boulders in a landslide near Hanogi Temple in Mandi district this morning. The vehicles were enroute Kullu to supply essential goods, including vegetables. pic.twitter.com/4wwIx1yIcP
— ANI (@ANI) August 14, 2020
Read More :