గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లాలో ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు చనిపోగా.. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Follow us

|

Updated on: Sep 09, 2020 | 6:40 PM

గుంటూరు జిల్లాలో ఘోర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దురు చనిపోగా.. ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గుంటూరులోని శావల్యాపురం మండలంలో బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కనమర్లపూడి వద్ద రెండు కార్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీ కొట్టాయి. ఏలూరు నుంచి వినుకొండ వైపు వస్తున్న కారు నంద్యాల నుంచి విజయవాడ వెళ్తున్న మరో కారు, ఎదురేదురుగా వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో నంద్యాలకు చెందిన వెంకటసుబ్బయ్య, ఏలూరుకి చెందిన ఉదయ్  అనే వ్యక్తులు స్పాట్ లోనే మృతి చెందారు.‌ మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు.

Also Read :

రాయలసీమ, దక్షిణ కోస్తాలకు భారీ వర్ష సూచన !

‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్