ఆటోలో పేలిన నాటు బాంబు.. ఎన్నికలకు లింక్..?

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ఆటోలో నుంచి జారిపడిన నాటుబాంబు రోడ్డుపై పేలింది. ఆటో రోడ్డుపై ఆగి ఉన్న సమయంలో పక్క నుంచి బైక్ వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడులో గాయపడ్డ బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం మార్కాపురం మండలం కొండేపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో పలువురికి గాయాలైన నేపథ్యంలో తాజాగా.. […]

ఆటోలో పేలిన నాటు బాంబు.. ఎన్నికలకు లింక్..?
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2019 | 11:40 AM

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ఆటోలో నుంచి జారిపడిన నాటుబాంబు రోడ్డుపై పేలింది. ఆటో రోడ్డుపై ఆగి ఉన్న సమయంలో పక్క నుంచి బైక్ వెళ్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.పేలుడు ధాటికి బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పేలుడులో గాయపడ్డ బాధితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం మార్కాపురం మండలం కొండేపల్లిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ దాడిలో పలువురికి గాయాలైన నేపథ్యంలో తాజాగా.. ఆటోలో నాటు బాంబు పేలడం మార్కాపురంలో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే.. నాటుబాంబు పేలుడుకి, ఘర్షణలకు మధ్య లింక్ ఏదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.