అస్సాం.. చమురు బావిలో మంటలు.. ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి
అస్సాం లోని తిన్ సకియా జిల్లాలో చమురుబావిలో మంటలు 14 రోజులుగా రేగుతున్నాయి. అయితే బుధవారం గ్యాస్ లీకయి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. ఈ మంటలు సుమారు పది కి.మీ. వరకు..
అస్సాం లోని తిన్ సకియా జిల్లాలో చమురుబావిలో మంటలు 14 రోజులుగా రేగుతున్నాయి. అయితే బుధవారం గ్యాస్ లీకయి ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మృతి చెందారు. ఈ మంటలు సుమారు పది కి.మీ. వరకు కనిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఇద్దరు ఉద్యోగుల శరీరాలపై కాలిన గాయాలు లేవని, మంటల ధాటి నుంచి తమను తాము రక్షించుకునేందుకు వారు దగ్గరలోని నీటి గుంత లో దూకి మునిగి మరణించి ఉండవచ్ఛు నని అధికారులు చెప్పారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటర్ల పొడవునా వేడి వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే ఇక్కడి నుంచి అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా మండుతున్న మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
#WATCH Fire flames continue to erupt from the gas well of Oil India Ltd at Baghjan in Tinsukia district, Assam. A team of State Disaster Response Force (SDRF) and fire engines are present at the spot. pic.twitter.com/PgtAC06RTP
— ANI (@ANI) June 10, 2020