దారుణం.. పండ్లు కొనుక్కోడానికి వెళ్లిన మహిళా డాక్టర్లపై..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళా వైద్యులపై దాడికి దిగిన సంఘటన.. సభ్యసమాజాన్ని తలదించుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పట్టణంలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీ చేస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు బుధవారం రాత్రి.. గౌతం నగర్‌లో పండ్లుకొనుక్కునేందుకు వెళ్లారు. అయితే వీరి వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందంటూ.. ఆ డాక్టర్ల ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి వారితో గొడవకు దిగాడు. వారు ఎంతగా సర్ధిచెప్పినా అర్థం […]

దారుణం.. పండ్లు కొనుక్కోడానికి వెళ్లిన మహిళా డాక్టర్లపై..
Follow us

| Edited By:

Updated on: Apr 09, 2020 | 9:13 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళా వైద్యులపై దాడికి దిగిన సంఘటన.. సభ్యసమాజాన్ని తలదించుకునేలా ఉంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పట్టణంలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ విభాగంలో డ్యూటీ చేస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు బుధవారం రాత్రి.. గౌతం నగర్‌లో పండ్లుకొనుక్కునేందుకు వెళ్లారు. అయితే వీరి వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందంటూ.. ఆ డాక్టర్ల ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి వారితో గొడవకు దిగాడు. వారు ఎంతగా సర్ధిచెప్పినా అర్థం చేసుకోకుండా.. వారిద్దరిపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దాడికి దిగాడు. దీంతో ఏమిచేయలేక ఆ వైద్యులిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీ వళ్లే కరోనా వ్యాపిస్తోందంటూ దాడికి దిగాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. డాక్టర్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.