తెలంగాణ : చేపల కోసం వల వేస్తే చిక్కిన మొసళ్లు…!
తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జాలర్లు వేసిన వలకు రెండు మొసళ్లు చిక్కాయి.
తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో జాలర్లు వేసిన వలకు రెండు మొసళ్లు చిక్కాయి. చెరువులో చేపల కోసం మత్స్యకారులు వల వేయగా…బరువుగా అనిపించడంతో సొర చేపలు ఏమైనా చిక్కాయేమో అని భావించారు. బయటకు తీయగా రెండు మొసళ్లు దర్శనమిచ్చాయి. అందులో ఒకటి పెద్దగా ఉండగా, రెండోది పిల్ల మొసలి. దీంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుఉన్న అటవీశాఖ సిబ్బంది జూరాల జలాశయంలో మొసళ్లను విడిచిపెట్టారు.