కుమరం భీం జిల్లాలో తీవ్ర విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో అన్నదమ్ముళ్ల ఆత్మహత్య.. రైలు కిందపడి మృతి..!
కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైలు కిందపడి అన్నదమ్ములిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
Brothers commited suicide: ఫ కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైలు కిందపడి అన్నదమ్ములిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన సిర్పూర్(టీ) రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను సిర్పూర్(టీ) మండల కేంద్రం బెస్తవాడకు చెందిన దివిటి దిలీప్(26), ఇతని తమ్ముడు శ్రీకాంత్(21)గా పోలీసులు గుర్తించారు. సోదరులిద్దరూ మద్యానికి బానిసలైన ఆర్థికంగా చితికిపోయారు. గత మూడు రోజుల నుంచి మద్యాన్ని సేవిస్తూనే ఉన్నారు. ప్రమాద ప్రాంతంలో దొరికిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆత్మహత్య చేసుకోబోయే ముందు సైతం ఓ వివాహానికి హాజరయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోద చేసుకుని దర్యాప్తు చేపట్టారు.