#Social distance అవును వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు!
వారి పేర్లు వింటేనే అందరికీ ఉప్పు.. నిప్పు గుర్తొచ్చేవి నిన్నటి దాకా.. కానీ ఇవాళ కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వారిద్దరిని దగ్గర చేసింది. వారిరువురు నాయకులు గత కొన్నాళ్లుగా సామాజిక దూరం పాటించేవారు. అది కరోనా కోసం కాదు..
MLA & MLC working together in Telangana: వారి పేర్లు వింటేనే అందరికీ ఉప్పు.. నిప్పు గుర్తొచ్చేవి నిన్నటి దాకా.. కానీ ఇవాళ కరోనా నేపథ్యంలో సామాజిక దూరం వారిద్దరిని దగ్గర చేసింది. వారిరువురు నాయకులు గత కొన్నాళ్లుగా సామాజిక దూరం పాటించేవారు. అది కరోనా కోసం కాదు.. నియోజకవర్గంలో వారిద్దరి మధ్య ఒకలాంటి వార్ నడిచేది. అందుకు కారణం వారిద్దరు గతంలో వేర్వేరు పార్టీల్లో వుండేవారు. ఒకరిపై ఇంకొకరు పోటీ చేసుకున్నారు.
అందులో సిట్టింగ్ మంత్రిగా వున్న నేత అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తర్వాత పరిస్థితి మారి, కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచన ఎమ్మెల్యే అధికార పార్టీకి మారారు. అయితేనే.. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ తమ వర్గాలను మెయింటైన్ చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా నువ్వా-నేనా అన్న రీతిలో ముందుకు సాగుతూ జిల్లాలోనే “టాక్ అఫ్ ది నాయకులుగా” గా నిలిచారు.
అయితే కరోనా నివారణలో భాగంగా ప్రజలను సామాజిక దూరం పాటించాలని పేర్కొంటూ ఆ నేతలు ఇప్పుడు “సామజికంగా దగ్గరయ్యారు”. వారే వీరు.. ఒకరు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాగా, మరొకరు ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నివారణలో భాగంగా జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత చేపట్టిన దేశవ్యాప్త లాక్ డౌన్లో భాగంగా తాండూరులో వారం రోజుల నుంచి నిత్యం పర్యటిస్తూ పై నేతలిద్దరు ప్రజలను చైతన్య పరుస్తున్నారు. తాజాగా వలస కార్మికులకు ప్రభుత్వం తరపున అందిస్తున్న ఉచిత బియ్యం, నగదు పంపిణీ కార్యక్రమాన్ని ఇటు ఎమ్మెల్యే, అటు ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి వేర్వేరు కార్యక్రమాలు చేయకుండా.. ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు తాండూరులో హాట్ టాపిక్గా మారింది. కరోనా కారణంగా వినిపిస్తున్ సామాజిక దూరం వీరిద్దరినీ సామాజికంగా దగ్గర చేసిందంటూ నియోజకవర్గ ప్రజలు ఛలోక్తులు విసురుకుంటున్నారు.